- దళారులు, పోస్టల్ డిలే, ప్రింటింగ్ ఆలస్యమే కారణం
హైదరాబాద్సిటీ, వెలుగు : గ్రేటర్లో ఆర్టీఏ ఇస్తున్న స్మార్ట్కార్డులను ఇక నుంచి ఖైరతాబాద్లోని హెడ్డాఫీసు నుంచే జారీ చేసేందుకు అధికారులు ప్రపోజల్స్రెడీ చేశారు. డ్రైవింగ్లైసెన్సులు, వాహనాల డాక్యుమెంట్లు, ఆర్సీ బుక్వంటివన్నీ ప్రస్తుతం జోనల్ఆర్టీఏ ఆఫీసుల నుంచే ఇస్తున్నారు.
గతంలో అప్లై చేసుకున్న తర్వాత స్మార్ట్కార్డులు డైరెక్ట్వాహనదారులకే ఇచ్చేవారు. బ్రోకర్ల సమస్య ఉండడంతో స్పీడ్పోస్టు ద్వారా డెలివరీ చేయడం మొదలుపెట్టారు. అయినా దళారుల దందా ఆగకపోవడం, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారం రోజుల్లో చేరాల్సిన కార్డులు నెల పడుతుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కార్డులు రావడం లేదని చాలామంది డూప్లికేట్కార్డుల కోసం ఆఫీసులకే వస్తున్నారు. దీంతో రూల్స్మార్చబోతున్నట్టు సమాచారం.
దళారులదే హవా
గ్రేటర్పరిధిలోని ఆరు జోనల్ఆఫీసుల నుంచి రోజుకు 5 వేల నుంచి 6 వేల కార్డులు జారీ అవుతున్నాయి. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్రిజిస్ట్రేషన్టైంలోనే అన్ని రకాల ఫీజులు, సర్వీస్ఛార్జీతో పాటు పోస్టల్ఫీజు కూడా తీసుకుంటున్నారు. కానీ ఇన్టైంలో వాహనదారులకు కార్డులు చేరడం లేదు. దీని వెనక కూడా దళారులు ఉంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో అధికారులు అండతో స్పీడ్పోస్టు ద్వారా పంపడం ఆపేస్తున్నారు. దీంతో వాహనదారులు ఆఫీసులకే వస్తుండడంతో వారి దగ్గర రూ.200 నుంచి రూ.300 తీసుకుంటున్నారు.
దీనిని నివారించడానికే స్మార్ట్కార్డుల జారీని జోనల్ఆఫీసుల నుంచి మార్చి ఖైరతాబాద్సెంట్రల్ఆఫీసుకు బదలాయించనున్నట్టు సమాచారం. అలాగే, స్మార్ట్ కార్డుల జారీని ప్రైవేట్సంస్థలకు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీఏ అధికారులే స్మార్ట్కార్డులను తయారు చేస్తున్నారు. ప్రింటింగ్పేపర్, రిబ్బన్, ఇంకును బయటే కొంటున్నారు. వీటిని సకాలంలో సరఫరా చేయకపోవడంతో కొన్ని సార్లు ప్రింటింగ్ఆలస్యమై వేలకొద్దీ కార్డుల డెలివరీ కావడం లేదు. దీంతో ప్రైవేట్సంస్థలకు ఇచ్చే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు.
